అల్లరి నరేష్ కొత్త చిత్రం కొత్త రిలీజ్ డేట్ లాక్.!

అల్లరి నరేష్ కొత్త చిత్రం కొత్త రిలీజ్ డేట్ లాక్.!

Published on Nov 5, 2022 1:12 PM IST

టాలీవుడ్ టాలెంటెడ్ హీరో అల్లరి నరేష్ హీరోగా చేస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో తాను చేస్తున్న మరో ఇంట్రస్టింగ్ ప్రాజెక్ట్ “ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం” కూడా ఒకటి. దర్శకుడు ఏ ఆర్ మోహన్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం అయితే ఆల్రెడీ షూట్ కంప్లీట్ చేసుకొని ఈ నవంబర్ లోనే రిలీజ్ కావడానికి రెడీ అయ్యింది. మరి ముందు అయితే ఈ చిత్రాన్ని ఈ నవంబర్ 11 న లాక్ చెయ్యగా మేకర్స్ అయితే ఇప్పుడు కొత్త డేట్ ని లాక్ చేశారు.

ఇప్పుడు ఇచ్చిన కొత్త అనౌన్సమెంట్ ప్రకారం అయితే ఈ చిత్రాన్ని నవంబర్ 11 నుంచి నవంబర్ 25 కి షిఫ్ట్ చేసినట్టుగా కన్ఫర్మ్ చేశారు. మరి మరో ఆసక్తికర పోస్టర్ ని రిలీజ్ చేసి అయితే ఈ కొత్త థియేట్రికల్ డేట్ ని అనౌన్స్ చేశారు. ఇక ఈ చిత్రంలో అయితే జాంబీ రెడ్డి ఫేమ్ ఆనంది హీరోయిన్ గా నటించగా జీ 5 మరియు హాస్య మూవీస్ వారు సంయుక్తంగా నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు