లేటెస్ట్ : నెక్స్ట్ ఇయర్ పవన్ ఫ్యాన్స్ కి డబుల్ ట్రీట్ లభించనుందా ?

లేటెస్ట్ : నెక్స్ట్ ఇయర్ పవన్ ఫ్యాన్స్ కి డబుల్ ట్రీట్ లభించనుందా ?

Published on Dec 17, 2022 2:00 AM IST


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియన్ మూవీ హరిహర వీరమల్లు. మెగాసూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఏ ఎం రత్నం నిర్మాతగా రూపొందుతోన్న ఈ మూవీలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా కనిపించనుంది. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న హరిహర వీరమల్లు నుండి ఇటీవల రిలీజ్ అయిన రెండు గ్లింప్స్ టీజర్స్, పోస్టర్స్ అన్ని కూడా మూవీ పై ఆడియన్స్ తో పాటు పవన్ ఫ్యాన్స్ లో భారీ అంచనాలు ఏర్పరిచాయి.

కాగా ఈ మూవీ వచ్చే ఏడాది మార్చి 30న ప్రేక్షకుల ముందుకి రానుంది. అయితే లేటెస్ట్ టాలీవుడ్ బజ్ ప్రకారం దీని తరువాత ఇటీవల హరీష్ శంకర్ తో ఉస్తాద్ భగత్ సింగ్, సుజీత్ తో మరొక సినిమా అనౌన్స్ చేసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, అతి త్వరలో సముద్రఖని దర్శకత్వంలో వినోదయ సిత్తం మూవీ రీమేక్ కూడా ప్రారంభించనున్నట్లు చెప్తున్నారు. అలానే వచ్చే ఏడాది హరిహర వీరమల్లు తో పాటు ఈ మూడు సినిమాల్లో ఒక సినిమా ఆడియన్స్ ముందుకి రానుందని, దానిని బట్టి మొత్తంగా 2023 లో పవర్ స్టార్ నుండి రెండు సినిమాలు రానుండడం పక్కా అంటున్నారు. మరి అదే కనుక నిజం అయితే పవన్ ఫ్యాన్స్ కి నెక్స్ట్ ఇయర్ డబుల్ ట్రీట్ ఖాయం అని అంటున్నారు సినీ విశ్లేషకులు. కాగా ఆయా సినిమాలకు సంబందించిన పూర్తి వివరాలు అతి త్వరలో అధికారికంగా వెల్లడి కావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు