షూటింగ్ పూర్తి చేసిన నిత్యామీనన్ !

బాలకృష్ణ ప్రధాన పాత్రగా దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ లో ‘మహానటి’ సావిత్రి పాత్రలో నిత్యామీనన్ నటిస్తోన్న విషయం తెలిసిందే. అప్పట్లో ఎన్టీఆర్ పక్కన మహానటి సావిత్రి చాలా చిత్రాల్లో కలిసి నటించారు. అందులో చాలా చిత్రాలు క్లాసిక్ చిత్రాలుగా మిగిలిపోయాయి, ఐతే వాటిల్లోని మాయాబజార్, మిస్సమ్మ, రక్త సంబంధం చిత్రాలకు సంబంధించిన షూటింగ్ సంఘటనలను ఈ బయోపిక్ లో చూపించనున్నారు. ఇప్పటికే నిత్యామీనన్ పై చిత్రబృందం ఆ సన్నివేశాల తాలూకు సీన్స్ ను చిత్రీకరించారు.

ఐతే తాజాగా సినీవర్గాల సమాచారం ప్రకారం నిత్యామీనన్ ఈ చిత్రానికి సంబంధించి తన షూటింగ్ పార్ట్ ని పూర్తి చేశారట. కీరవాణి ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. కాగా జనవరి 9న ఈ చిత్రం మొదటి పార్ట్ ‘కథానాయకుడు’ను విడుదల చేసి, జనవరి 24న రెండో పార్ట్ ‘మహానాయకుడు’ను విడుదల చేయనున్నారు. బుర్రా సాయిమాధవ్‌ మాటలు అందిస్తున్న ఈ చిత్రానికి సాయి కొర్రపాటి, విష్ణు సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

Exit mobile version