నితిన్ ఒకేసారి రెండు సినిమాలను మొదలుపెట్టనున్నాడు !

శ్రీనివాస కళ్యాణం తరువాత గ్యాప్ తీసుకున్న యంగ్ హీరో నితిన్ తన కొత్త చిత్రంలో నటించడానికి రెడీ అవుతున్నాడు. ఛలో ఫేమ్ వెంకీ కుడుముల తెరకెక్కించనున్న ఈ చిత్రం ఫిబ్రవరిలో మొదలు కానుంది. కమర్టియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో రష్మిక కథానాయికగా నటించనుంది. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించనున్న ఈ చిత్రానికి మహతి స్వర సాగర్ సంగీతం అందించనున్నారు.

ఇక నితిన్ ఈ చిత్రం తో పాటు ‘కుమారి 21ఎఫ్’ ఫేమ్ పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో నటించడానికి ఓకే చెప్పాడట. ఈచిత్రంమార్చి లేక ఏప్రిల్ లో సెట్స్ మీదకు వెళ్లనుంది. బన్నీ వాసు ఈచిత్రాన్ని నిర్మించనున్నాడు. మరి ఇటీవల వరస పరాజయాలను చవి చూసిన నితిన్ ఈ రెండు చిత్రాలతో హిట్లు కొట్టి మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కుతాడో లేదో చూడాలి.

Exit mobile version