విషాదం : ప్రముఖ నటుడు ‘విక్రమ్ గోఖలే’ మృతి

విషాదం : ప్రముఖ నటుడు ‘విక్రమ్ గోఖలే’ మృతి

Published on Nov 26, 2022 4:00 PM IST

ప్రముఖ మరాఠీ థియేటర్ ఆర్టిస్ట్ మరియు బాలీవుడ్ లో పలు సినిమాలు చేసిన విక్రమ్ గోఖలే నేడు కొద్దిసేపటి క్రితం మరణించారు. గతంలో బాలీవుడ్ లో మంచి సక్సెస్ సాధించిన హం దిల్ దే చుప్కే సనమ్, భూల్ భులయ్య, మిషన్ మంగళ్, హే రామ్, అయ్యారి, బ్యాంగ్ బ్యాంగ్ వంటి సినిమాలతో పాటు తెలుగులో కలవరమాయే మదిలో మూవీలో కూడా ఆయన కీలక పాత్రలు చేసి తన నటనతో ఆడియన్స్ మనసు గెలుచుకున్నారు. ఇక ఇటీవల నవంబర్ 5 న గుండె, ఊపిరితిత్తుల సంబంధింత వ్యాధితో పూణే లోని దీనానాథ్ మంగేష్కర్ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు.

అయితే అప్పటి నుండి డాక్టర్స్ ఆయనకు మెరుగైన వైద్యం అందిస్తూ వస్తున్నారు. కాగా కొద్దిసేపటి క్రితం ఆయన పరిస్థితి మరింతగా విషమించి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారని కుటుంబసభ్యులు అధికారికంగా ప్రకటించారు. విక్రమ్ గోఖలేకి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాగా ఆయన మరణంతో బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అలముకున్నాయి. పలువురు ప్రేక్షకాభిమానులతో పాటు సినిమా ప్రముఖులు విక్రమ్ గోఖలే మరణానికి చింతిస్తూ వారి పవిత్రాత్మకు శాంతి చేకూరాలని ఘనంగా నివాళులు అర్పిస్తున్నారు. కొద్దిసేపటి క్రితం బాలీవుడ్ స్టార్ యాక్టర్ అక్షయ్ కుమార్, విక్రమ్ గోఖలే తో చేసిన సినిమాలు, అలానే తనకు ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా నివాళిని అర్పించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు