దర్శకధీరుడు రాజమౌళి, యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల కాంబినేషన్ లో తెరకెక్కబోయే చిత్రం ప్రారంభయ్యే ముహూర్తం ఖరారైంది. ఈ చిత్రం షూటింగ్ అక్టోబర్ నెలలో మొదలు కానుంది. డీవీవీ దానయ్య, డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘ఆర్ఆర్ఆర్’ అనేది వర్కింగ్ టైటిల్ గా ఉంది.
తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఇప్పటికే ఈ చిత్ర కథ పూర్తి అయి, అద్భుతంగా వచ్చిందని, ఇద్దరి హీరోలకు కూడా వినిపించారని తెలుస్తోంది. కాగా మొదటగా ఎన్టీఆర్ పార్ట్, తర్వాత రామ్ చరణ్ కి సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఆ తరువాత ఇద్దరి కాంబినేషన్ లో ఉన్న సన్నివేశాలను తెరకెక్కిస్తారట. ఐతే ఈ చిత్రం పూర్తి కావడానికి రెండు సంవత్సరాలు పడుతుందని, 2020లో విడుదల కానున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం సమకూర్చగా, కెమెరా బాధ్యతలు సెంథిల్ కుమార్ చేపట్టనున్నారు.
ఇక ప్రస్తుతం ఎన్టీఆర్, త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘అరవింద సమేత’ చిత్ర షూటింగ్ ను శరవేగంగా పూర్తి చేస్తుండగా, రామ్ చరణ్, దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటిస్తున్నాడు.