95వ అకాడమీ అవార్డుల వేడుక ఈరోజు లాస్ ఏంజెల్స్లోని డాల్బీ థియేటర్లో జరిగింది. ది ఎలిఫెంట్ విస్పరర్స్ అనే భారతీయ డాక్యుమెంటరీ ఈ వేడుకలో చరిత్ర సృష్టించింది. నూతన దర్శకుడు కార్తికీ గోన్సాల్వేస్ దర్శకత్వం వహించిన ఈ భారతీయ డాక్యుమెంటరీ ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ విభాగంలో ఆస్కార్ అవార్డును గెలుచుకుంది. ఈ అవార్డ్ గెలుపొందటం పట్ల దేశ వ్యాప్తంగా ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు.
ఈ సంవత్సరం భారతదేశం సాధించిన మొదటి ఆస్కార్ ఇదే. ఈ చిత్రం ఆస్కార్ అవార్డు గెలుపొందడం పట్ల గ్లోబల్ స్టార్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కంగ్రాట్స్ తెలిపారు. ఆస్కార్ను గెలుచుకున్న మొట్టమొదటి భారతీయ డాక్యుమెంటరీగా మీరు మమ్మల్ని ఎంతో గర్వించేలా చేసారు. మరెన్నో కథలు చెప్పడానికి మీకు మరింత శక్తి అని అన్నారు. అకాడమీ అవార్డును గెలుచుకున్న మొట్టమొదటి భారతీయ షార్ట్ ఫిల్మ్ నెట్ఫ్లిక్స్లో ప్రసారం చేయడానికి ఇప్పటికే అందుబాటులో ఉంది. ఈ చిత్రం ఆస్కార్ అవార్డు గెలుపొందడం పట్ల సినీ ప్రముఖులు, అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Congratulations team #ElephantWhisperers. You’ve made us extremely proud by being the first ever Indian Documentary to win an Oscar. More power to you to tell many more stories. @EarthSpectrum @Guneetm @SikhyaEnt @aachinjain pic.twitter.com/Jp8dCZ23bt
— Jr NTR (@tarak9999) March 13, 2023