
యంగ్ టైగర్ ఎన్ టి ఆర్, కింగ్ నాగార్జున కలిసి వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఒక సినిమా చెయ్యవలసివుంది. ఈ సినిమా బేస్ స్టొరీ లైన్ ని ఇద్దరు అగ్రనటులకు చెప్పడం జరిగింది.
ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ ని కొద్దికాలం పాటు నిలిపివేశారు. సమాచారం ప్రకారం వంశీ చెప్పిన కధలో కొన్ని పార్ట్ లు మన తారక్ కి నచ్చలేదట. వాటిని తిరిగిరాసే వరకూ ఈ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చే అవకాశాలు లేవు.
బాక్స్ ఆఫీస్ దగ్గర వరుసగా సినిమాలు పరాజయం పాలవ్వడంతో ఎన్.టి.ఆర్ తన తదుపరి స్క్రిప్ట్ లపై తగు జాగ్రత్తలు తీసుకుంటున్నాడు