రంజాన్ కు బంపర్ గిఫ్ట్ ఇచ్చిన ఎన్టీఆర్ !

రంజాన్ కు బంపర్ గిఫ్ట్ ఇచ్చిన ఎన్టీఆర్ !

Published on Jun 25, 2017 7:58 PM IST


తారక్ ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో ‘జై లవ కుశ’ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ‘జనతా గ్యారేజ్’ హిట్ తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న సినిమా కావడం, అందులో ఆయన త్రిపాత్రాభినయం చేస్తుండటంతో ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలున్నాయి. గత నెలలో విడుదలైన ఫస్ట్ లుక్స్ కూడా సక్సెస్ కావడంతో నిర్మాణ సంస్థ ఎన్టీఆర్ ఆర్ట్స్ తాజాగా రంజాన్ సందర్బంగా సినిమా విడుదల తేదీని ప్రకటించింది.

ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 21న రిలీజ్ చేయనున్నారు. ఇలా ఉన్నట్టుండి రిలీజ్ డేట్ ప్రకటించడంతో అభిమానుల్లో ఒక్కసారిగా కోలాహలం మొదలైంది. అలాగే జూలై మొదటి వారంలో టీజర్ ను కూడా రిలీజ్ చేయనున్నట్లు గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇకపోతే ఈ చిత్రంలో రాశి ఖన్నా, నివేత థామస్ లు హీరోయిన్లుగా నటిస్తుండగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు