క్లైమాక్స్ కోసం కసరత్తులు చేస్తున్న కొరటాల !

క్లైమాక్స్ కోసం కసరత్తులు చేస్తున్న కొరటాల !

Published on Jun 27, 2022 1:51 AM IST

‘యంగ్ టైగర్ ఎన్టీఆర్’ – క్లాసిక్ డైరెక్టర్ కొరటాల శివ కలయికలో రాబోతున్న పాన్ ఇండియా సినిమాకు సంబంధించి ఒక అప్ డేట్ తెలుస్తోంది. ఈ సినిమా క్లైమాక్స్ కోసం భారీ సెట్ ను నిర్మిస్తున్నారు. క్లైమాక్స్ లో వచ్చే ఈ సెట్ బ్లాస్ట్ సీన్ లో ఎన్టీఆర్ యాక్షన్ అదరిపోతుందని తెలుస్తోంది. అలాగే ఈ సన్నివేశాల్లో వేరే సీనియర్ నటుడు కూడా కనిపించ బోతున్నాడట. మొత్తానికి ఈ సినిమా క్లైమాక్స్ కోసం కొరటాల బాగా కసరత్తులు చేస్తున్నాడు. ఇక మొదట ఈ సినిమా జూన్‌లో సెట్స్‌పైకి వస్తుందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

అయితే, ఈ సినిమా షూటింగ్ ఇంకా ఆలస్యం కానుంది. ఈ చిత్రం ఆగస్టులో సెట్స్‌ పైకి వెళ్లనుంది. ఈ సినిమాలో తన పాత్ర కోసం తారక్ డిఫరెంట్ మేకోవర్‌ ట్రై చేస్తున్నారు. ఈ సినిమా కోసం 8-9 కిలోల బరువు తగ్గనున్నాడు తారక్. కాగా ఎన్టీఆర్ – కొరటాల కాంబినేషన్ లో గతంలో వచ్చిన ‘జనతా గ్యారేజ్’ పెద్ద హిట్ కావడంతో ఈ సినిమా పై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. అన్నట్టు 2023 సంక్రాంతికి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకోస్తున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు