ఓటిటి : “మంజుమ్మల్ బాయ్స్” పాన్ ఇండియా ఎంట్రీకి కొత్త డేట్ వచ్చేసింది


ఈ ఏడాదిలో మళయాళ సినిమా అందుకున్న భారీ హిట్స్ ఒకదాన్ని మించి ఒకటి వచ్చాయి. మరి అలా వచ్చిన చిత్రాల్లో మళయాళ ఇండస్ట్రీలో సరికొత్త ఇండస్ట్రీ హిట్ చిత్రం “మంజుమ్మల్ బాయ్స్” కూడా ఒకటి. దర్శకుడు చిదంబరం తెరకెక్కించిన ఈ చిత్రం నిజ జీవిత సంఘటన ఆధారంగా తీశారు.

అయితే ఈ చిత్రంలో సౌబిన్ షాహిర్, శ్రీనాథ్ బాసి, బాలు వర్గీస్, గణపతి ఎస్ పొదువల్, జీన్ పాల్ లాల్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించగా ఈ చిత్రం తెలుగు సహా తమిళ్ లో కూడా డబ్బింగ్ అయ్యి భారీ వసూళ్లు సాధించింది. అయితే ఈ చిత్రం ఓటిటి రిలీజ్ విషయంలో గత కొన్నాళ్ల నుంచి టాక్ నడుస్తుంది.

మే 3న వస్తుంది అని కొన్ని పుకార్లు వచ్చాయి కానీ ఫైనల్ గా డిస్నీ+ హాట్ స్టార్ వారు దీనిపై అఫీషియల్ క్లారిటీ ఇచ్చేసారు. ఈ సినిమా ఓటిటిలో ఈ మే 5 నుంచి స్ట్రీమింగ్ కి వస్తున్నట్టుగా కొత్త డేట్ అందించారు. అలాగే ఈ సినిమా ఒరిజినల్ మళయాళం సహా తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ భాషల్లో రాబోతున్నట్టుగా పాన్ ఇండియా ఎంట్రీని ఖరారు చేశారు. మరి ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నవారు అప్పటివరకు ఆగితే సరిపోతుంది.

Exit mobile version