ఆరోజు పవన్ ఫ్యాన్స్ కి మాసివ్ ట్రీట్.?

ఆరోజు పవన్ ఫ్యాన్స్ కి మాసివ్ ట్రీట్.?

Published on Dec 1, 2022 10:00 AM IST

ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నిధి అగర్వాల్ హీరోయిన్ గా విలక్షణ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ లో తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం “హరిహర వీరమల్లు”. మరి భారీ స్థాయి అంచనాలు ఉన్న ఈ చిత్రానికి అయితే పవన్ కూడా మరింత కేర్ తీసుకొని చేస్తుండగా అభిమానుల్లో అంతకంతకూ అంచనాలు మరింత పెరుగుతూ వస్తున్నాయి.

ఇక ఇదిలా ఉండగా ఈ సినిమా అప్డేట్స్ ని మేకర్స్ కూడా ఎప్పటికప్పుడు అందిస్తుండగా లేటెస్ట్ గా ఓ టాక్ అయితే ఫ్యాన్స్ నడుమ మంచి హాట్ టాపిక్ గా నడుస్తుంది. మరి వచ్చే ఏడాది పవర్ స్టార్ పవన్ కెరీర్ లో మొదటి ఇండస్ట్రీ అయినటువంటి “ఖుషి” ని ఏప్రిల్ 27న గ్రాండ్ గా రీ రిలీజ్ చేస్తున్నట్టుగా ఇప్పుడు డేట్ కన్ఫర్మ్ అయ్యింది.

మరి ఆ మాసివ్ డే కి హరిహర వీరమల్లు నుంచి ఓ గట్టి ట్రీట్ ఉండే ఛాన్స్ ఉందని వారు భావిస్తున్నారు. ఓ పక్క ఖుషి రీ రిలీజ్ తో అదే రోజున వీరమల్లు నుంచి ఏదైనా వీడియో ట్రీట్ పడితే హైప్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్తుంది అని లెక్కలు వేసుకుంటున్నారు. ఎలాగో సినిమా మే రిలీజ్ ఉండొచ్చని బజ్ ఉంది ఒకవేళ మే నెలకి వీరమల్లు సినిమా వస్తే ఏప్రిల్ లో ఈ ప్లానింగ్ తో అదిరిపోతుంది చెప్పొచ్చు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు