ఓటిటి పార్ట్నర్ ని లాక్ చేసుకున్న సాయి పల్లవి “గార్గి”.!

ఓటిటి పార్ట్నర్ ని లాక్ చేసుకున్న సాయి పల్లవి “గార్గి”.!

Published on Jul 15, 2022 9:00 AM IST


లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన పలు చిత్రాలు గత కొన్నాళ్ల నుంచి వరుసగా వస్తున్న సంగతి తెలిసిందే. అలా రీసెంట్ గా సాయి పల్లవి మరియు రానా దగ్గుబాటి కాంబోలో వచ్చిన “విరాట పర్వం” తో పలకరించగా ఇప్పుడు మొదటి సారిగా చేసిన ఫీమేల్ ఓరియెంటెడ్ చిత్రం “గార్గి”. దర్శకుడు గౌతమ్ రామచంద్రన్ తెరకెక్కించిన ఈ చిత్రం ఈరోజే థియేటర్స్ లో రిలీజ్ అయ్యింది.

అయితే ఆల్రెడీ ప్రీమియర్స్ తో మంచి రెస్పాన్స్ ని అందుకుంటున్న ఈ చిత్రం ఓటిటి స్ట్రీమింగ్ పార్ట్నర్ ని లాక్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ చిత్రాన్ని ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ సోనీ లివ్ వారు కొనుగోలు చేశారట. దీనితో మరికొన్ని వారాల్లో అయితే ఈ చిత్రం స్ట్రీమింగ్ కి అందుబాటులోకి రానుంది. ఇక ఈ చిత్రానికి గోవింద్ వసంత సంగీతం అందించగా రవిచంద్రన్ రామచంద్రన్, థామస్ జార్జ్, ఐశ్వర్య లక్ష్మి వి, గౌతం రామచంద్రన్ లు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు