“థాంక్ యూ” ఓటిటి స్ట్రీమింగ్ పార్ట్నర్స్ ఎవరెవరు అంటే..!

“థాంక్ యూ” ఓటిటి స్ట్రీమింగ్ పార్ట్నర్స్ ఎవరెవరు అంటే..!

Published on Jul 22, 2022 9:00 AM IST


టాలీవుడ్ నుంచి లేటెస్ట్ గా వచ్చిన మరో అవైటెడ్ చిత్రం “థాంక్ యూ”. మన టాలీవుడ్ యంగ్ అండ్ ఫైనెస్ట్ హీరో అక్కినేని నాగ చైతన్య హీరోగా రాశీ ఖన్నా, అవికా గోర్ మరియు మాళవిక నైర్ లు హీరోయిన్స్ గా నటించిన ఈ చిత్రాన్ని దర్శకుడు విక్రమ్ కే కుమార్ తెరకెక్కించారు. మరి మంచి బజ్ నడుమ సహా ఏపీలో మంచి ప్రీమియర్స్ తో వచ్చిన ఈ చిత్రం పై ఇపుడు లేటెస్ట్ అప్డేట్ తెలిసింది.

ఈ చిత్రాన్ని రెండు ప్రముఖ స్ట్రీమింగ్ యాప్స్ కొనుగోలు చేసినట్టుగా తెలుస్తుంది. మరి ఈ చిత్రాన్ని ప్రముఖ ఓటిటి సంస్థలు అమేజాన్ ప్రైమ్ వీడియో మరియు సన్ నెక్స్ట్ వారు కొనుగోలు చేశారట. మరి థియేటర్స్ లో రన్ కంప్లీట్ అయ్యాక అయితే ఈ చిత్రం ఓటిటి లో స్ట్రీమింగ్ కి వస్తుంది. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించగా దిల్ రాజు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు