ఆగష్టులో ‘మా ఊరి ప్రేమకథ’ !

యంగ్ తరంగ్ మంజునాథ్ హీరోగా ‘శరణం గచ్ఛామి’ ఫేం తనిష్క తివారి హీరోయిన్ గా శ్రీ మల్లికార్జునస్వామి క్రియేషన్స్ పతాకం పై మంజునాథ్ దర్శకత్వంలో లక్ష్మీ దేవి, మహేంద్రనాథ్ సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం “మా ఊరి ప్రేమకథ”. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో జరిగే లవ్ అండ్ యాక్షన్ ఎంటెర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రం షూటింగ్ పూర్తిచేసుకొని ప్రస్తుతం డి ఐ కార్యక్రమాలను జరుపుకుంటోంది. ఈ సందర్బంగా నిర్మాతలు చిత్ర విశేషాలను తెలిపారు.

నిర్మాతలు లక్ష్మీదేవి, మహేంద్రనాథ్ మాట్లాడుతూ.. ఈ సినిమా కథ,కథనాలు ఆకట్టుకుంటాయి. మంజునాథ్ హీరోగా నటిస్తూ .. అద్భుతంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. షూటింగ్ అంతా కంప్లీట్ అయ్యింది. త్వరలో సెన్సార్ పూర్తిచేసి ఆగష్ట్ లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం.. అన్నారు. ఈ చిత్రానికి సంగీతం; జయసూర్య, కెమెరా; కళ్యాణ్ సమి, ఎడిటింగ్; ఆవుల వెంకటేష్, కథ – మాటలు – స్క్రీన్ ప్లై – దర్శకత్వం- మంజునాథ్, నిర్మాతలు; లక్ష్మీదేవి, మహేంద్రనాథ్.

Exit mobile version