ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ పై లేటెస్ట్ అప్ డేట్ !

ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ పై లేటెస్ట్ అప్ డేట్ !

Published on Nov 13, 2022 11:25 PM IST


‘గీత గోవిందం’తో భారీ విజయాన్ని నమోదు చేశాడు పరుశురామ్. ప్రపంచ వ్యాప్తంగా భారీ వసూళ్ళను సాధించి బ్లాక్ బస్టర్ గా నిలిచింది ఈ చిత్రం. ఆ తర్వాత సూపర్ స్టార్ మహేశ్ బాబుతో సర్కారు వారి పాట సినిమా తీసి సూపర్ హిట్ కొట్టాడు. అయితే, ప్రస్తుతం పరుశురామ్ తన తర్వాత సినిమాని బాలయ్య బాబుతో ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఊర్వశివో రాక్షశివో చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బాలయ్య కోసం ఓ కథ రాస్తున్నాను అని పరుశురామ్ చెప్పుకొచ్చాడు.

ఐతే, ఈ కాంబినేషన్ కి సంబంధించి లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం.. పరుశురామ్ కథను పూర్తి చేశాడట. వచ్చే వారం బాలయ్యను కలిసి ఫుల్ స్క్రిప్ట్ ను వినిపించబోతున్నాడు. మరి కథ విన్న తర్వాత బాలయ్య ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి. ఏది ఏమైనా కథ ఓకే అయితే మాత్రం.. మొత్తానికి పరుశురామ్ – బాలయ్య కాంబినేషన్ లో ఓ సినిమా రావడం పక్కా. కాకపోతే ఈ చిత్రం వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్తుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు