సమ్మర్ తర్వాతే పరుశురామ్ టార్గెట్ !

సమ్మర్ తర్వాతే పరుశురామ్ టార్గెట్ !

Published on Dec 19, 2022 9:00 AM IST

సూపర్ స్టార్ మహేశ్ బాబుతో సర్కారు వారి పాట సినిమా తీసి సూపర్ హిట్ కొట్టిన దర్శకుడు పరుశురామ్ ప్రస్తుతం తన తర్వాత సినిమాని బాలయ్య బాబుతో ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఊర్వశివో రాక్షశివో చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బాలయ్య కోసం ఓ కథ రాస్తున్నాను అని పరుశురామ్ చెప్పుకొచ్చాడు. ఐతే, ఈ కాంబినేషన్ కి సంబంధించి లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం.. పరుశురామ్ కథను పూర్తి చేసి.. బాలయ్య కి వినిపించాడట. బాలయ్యకి బాగా నచ్చింది.

కాకపోతే.. ఫుల్ స్క్రిప్ట్ డైలాగ్స్ తో సహా మరో నేరేషన్ ఉంది. రానున్న వారాల్లో బాలయ్యను కలిసి ఫుల్ స్క్రిప్ట్ ను వినిపించబోతున్నారు. మరి పూర్తి స్క్రిప్ట్ విన్న తర్వాత బాలయ్య ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి. ఏది ఏమైనా కథ ఓకే అయితే మాత్రం.. మొత్తానికి పరుశురామ్ – బాలయ్య కాంబినేషన్ లో ఓ సినిమా రావడం పక్కా. కాకపోతే ఈ చిత్రం వచ్చే ఏడాది సమ్మర్ తర్వాతే సెట్స్ పైకి వెళ్తుంది. పరుశురామ్ కూడా సమ్మర్ తర్వాతే తమ టార్గెట్ అంటున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు