బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ హీరోగా దీపికా పదుకొనె హీరోయిన్ గా జాన్ అబ్రహం విలన్ గా నటించిన లేటెస్ట్ చిత్రం “పఠాన్”. భారీ యాక్షన్ ట్రీట్ గా వచ్చిన ఈ చిత్రం యాక్షన్ తో పాటుగా సాలిడ్ ఎమోషన్స్ ని కూడా పండించడంతో షారుఖ్ ఖాన్ కి మాత్రమే ఓ సెన్సేషనల్ కం బ్యాక్ లా కాకుండా టోటల్ బాలీవుడ్ ఇండస్ట్రీకే భారీ హిట్ గా నిలిచింది. మరి ఈ భారీ సినిమా ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర మొదటి వారం రన్ ని కంప్లీట్ చేసుకుంది.
ఇప్పుడు వరకు అయితే ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా 634 కోట్ల గ్రాస్ ని అందుకున్నట్టుగా మేకర్స్ అనౌన్స్ చేశారు. మరి ఇందులో ఇండియా నుంచే 395 కోటు రాగా ఓవర్సీస్ నుంచి 239 కోట్లు వసూళ్లు అందుకుని బాలీవుడ్ హిస్టరీ లో అనేక రికార్డులు నమోదు చేస్తుంది. మరి ఈ సినిమా లాంగ్ రన్ లో మరిన్ని వండర్స్ నమోదు చేస్తుందని కూడా ట్రేడ్ పండితులు అభిప్రాయ పడుతున్నారు. మరి అది ఎక్కడ ఆగుతుందో చూడాలి.
#Pathaan continues to win hearts, keep the love coming ❤️
Book your tickets now! https://t.co/SD17p6x9HI | https://t.co/VkhFng6vBjCelebrate #Pathaan with #YRF50 only at a big screen near you, in Hindi, Tamil and Telugu. pic.twitter.com/ELL6fAAxLH
— Yash Raj Films (@yrf) February 1, 2023