వెబ్ సిరీస్ కి దర్శకత్వం వహించనున్న పవన్ కళ్యాణ్ డైరెక్టర్

వెబ్ సిరీస్ కి దర్శకత్వం వహించనున్న పవన్ కళ్యాణ్ డైరెక్టర్

Published on Jul 4, 2022 2:00 PM IST


దర్శకుడు క్రిష్ జాగర్లమూడి ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తన రాబోయే చిత్రం హరి హర వీర మల్లు షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా కొత్త షెడ్యూల్ త్వరలో ప్రారంభం కానుంది. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే, ఈ స్టార్ డైరెక్టర్ త్వరలో తన మొదటి వెబ్ సిరీస్‌ని డైరెక్ట్ చేయనున్నాడు.

గాసిప్ ఏమిటంటే, ఈ దర్శకుడు ఒక వేశ్య జీవితం చుట్టూ తిరిగే మహిళా – కేంద్రీకృతం అయిన సిరీస్‌కి దర్శకత్వం వహించే అవకాశం ఉంది. గమనించదగ్గ విషయం ఏమిటంటే, దర్శకుడు వేదంలో ఈ టాపిక్‌ను టచ్ చేసాడు. OTT ప్రాజెక్ట్‌కి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెలువడనున్నాయి. క్రిష్ హరిహర వీర మల్లు పూర్తి చేసిన తర్వాత వెబ్ సిరీస్‌ను ప్రారంభించడం ఖాయం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు