బ్లాక్ బస్టర్ రొమాంటిక్ మూవీ సీక్వెల్ అనౌన్స్ చేసిన పవన్ ప్రొడ్యూసర్

బ్లాక్ బస్టర్ రొమాంటిక్ మూవీ సీక్వెల్ అనౌన్స్ చేసిన పవన్ ప్రొడ్యూసర్

Published on Dec 28, 2022 12:35 AM IST


ప్రముఖ టాలీవుడ్ నిర్మాత ఏ ఎం రత్నం చిన్న కుమారుడు రవికృష్ణ హీరోగా శ్రీ సూర్య మూవీస్ బ్యానర్ పై సెల్వ రాఘవన్ దర్శకత్వంలో రూపొందిన రొమాంటిక్ ఎమోషనల్ లవ్ స్టోరీ 7జి బృందావన్ కాలనీ. 2004లో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏ ఎం రత్నం నిర్మించిన ఈ సినిమాలో సోనియా అగర్వాల్ హీరోయిన్ గా నటించగా యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు.

అప్పట్లో ఎంతో గొప్ప విజయం అందుకున్న ఈ సినిమా, అలానే ఇందులోని సాంగ్స్ ఇప్పటికీ కూడా ఆడియన్స్ మర్చిపోలేదు. అక్కడక్కడా పలు చోట్ల ఈ సినిమాలోని సాంగ్స్ వినిపిస్తూనే ఉంటాయి. అయితే నేడు ఒక మీడియా ఛానల్ ఇంటర్వ్యూలో భాగంగా ఏఎం రత్నం మాట్లాడుతూ, గతంలో తన కుమారుడితో తీసిన 7జి బృందావన్ కాలనీ మూవీ సీక్వెల్ కి సంబంధించి ప్రస్తుతం స్టోరీ డిస్కషన్స్ జరుగుతున్నాయని అన్నారు.

అతి త్వరలో రవికృష్ణ హీరో గానే దానిని తెరకెక్కిస్తామని, రాబోయే మరికొద్దిరోజుల్లో ఆ ప్రాజక్ట్ కి సంబందించిన పూర్తి వివరాలు వెల్లడిస్తాం అని తెలిపారు. గతంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఖుషి, బంగారం, పులి వంటి సినిమాలు తీసిన ఏఎం రత్నం ప్రస్తుతం ఆయనతో హరిహర వీరమల్లు అనే పాన్ ఇండియన్ పీరియాడికల్ మూవీ తీస్తున్న సంగతులు తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు