పవన్ కళ్యాణ్ – సుజీత్ ల ఓజి మూవీ పై ఆ వార్తల్లో నిజం ఎంత ?

పవన్ కళ్యాణ్ – సుజీత్ ల ఓజి మూవీ పై ఆ వార్తల్లో నిజం ఎంత ?

Published on Feb 5, 2023 3:00 AM IST


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో హరిహర వీరమల్లు మూవీ చేస్తోన్న సంగతి తెలిసిందే. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మెగాసూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఏఎం రత్నం దీనిని పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు. అయితే ఈ మూవీ తరువాత ఇప్పటికే హరీష్ శంకర్ తో ఉస్తాద్ భగత్ సింగ్, అలానే యువ దర్శకుడు సుజీత్ తో ఓజి మూవీస్ అనౌన్స్ చేసారు పవన్ కళ్యాణ్. ఇటీవల ఈ రెండు మూవీస్ యొక్క అధికారిక పూజా కార్యక్రమాలు జరిగాయి.

అయితే మ్యాటర్ ఏమిటంటే, పవన్ కు పెద్ద అభిమాని అయిన సుజీత్ ప్రస్తుతం ఓజి స్టోరీ ని పవర్ఫుల్ గా సిద్ధం చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఈ సినిమా ఒక తమిళ సూపర్ హిట్ మూవీకి రీమేక్ అనేది లేటెస్ట్ టాలీవుడ్ బజ్. నిజానికి ఉస్తాద్ భగత్ సింగ్, తమిళ హీరో విజయ్ నటించిన తేరి కి రీమేక్ అనే వార్తలు కూడా ఇటీవల ప్రచారం అయ్యాయి. ఇప్పుడు లేటెస్ట్ గా సుజీత్ తీస్తున్న ఓజి మూవీ కూడా రీమేక్ అనే న్యూస్ రావడంతో అందులో నిజానిజాలు ఎంతవరకు ఉన్నాయి అనేది ఎవరికి తెలియడం లేదు. ఏది ఏమైనా దీనికి సంబంధించి ఆ మూవీ యూనిట్ నుండి అఫీషియల్ ప్రకటన వచ్చే వరకు దీనిని నమ్మలేం అంటున్నారు సినీ విశ్లేషకులు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు