నటసింహం బాలయ్య బాబు – పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆన్ స్టాపబుల్ వేదిక పై కలవబోతున్న సంగతి తెలిసిందే. ఐతే, పవన్, బాలయ్య కోసం మరో అడుగు ముందుకు వేయబోతున్నాడు. ‘వీరసింహారెడ్డి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గెస్టుగా రాబోతున్నాడట. పవన్ ను గెస్ట్ గా తీసుకురావడానికి నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
కాగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానున్న వీరసింహా రెడ్డి పై ఫ్యాన్స్ లో రోజురోజుకు ఆసక్తి పెరుగుతుంది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో, మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. థమన్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నాడు. ‘క్రాక్’ సినిమాతో భారీ కమర్షియల్ హిట్ అందుకున్న గోపీచంద్ మలినేని, మరి వీర సింహా రెడ్డి తో.. ఏ రేంజ్ హిట్ కొడతాడో చూడాలి. ఈ సినిమా పై అయితే మంచి అంచనాలు ఉన్నాయి. పైగా అఖండ లాంటి భారీ హిట్ తర్వాత బాలయ్య చేస్తున్న సినిమా ఇది.