పూరీ “జన గణ మన” కోసం పూజా భారీ పారితోషికం!

పూరీ “జన గణ మన” కోసం పూజా భారీ పారితోషికం!

Published on Jun 9, 2022 12:30 AM IST

విజయ్ దేవరకొండ హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం జన గణ మన. ఈ చిత్రం లో విజయ్ దేవరకొండ సరసన హీరోయిన్ గా పాన్ ఇండియా హీరోయిన్ పూజా హెగ్డే నటిస్తుంది. పూరి జగన్నాథ్ ఇప్పటికే విజయ్ తో లైగర్ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. అయితే జన గణ మన పూరి జగన్నాథ్ కి డ్రీమ్ ప్రాజెక్ట్ కావడం తో నిర్మాణం విషయం లో ఎక్కడా కాంప్రమైజ్ కావడం లేదు.

పూజ కొన్ని రోజుల క్రితం షూట్‌లో చేరింది మరియు ప్రస్తుతం పూజకు సంబంధించిన కీలక సన్నివేశాలను ముంబైలో చిత్రీకరిస్తున్నారు. పూజా హెగ్డే ఈ చిత్రం కోసం భారీ పారితోషికం ను డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. తను ఈ చిత్రానికి ఐదు కోట్ల రూపాయలు తీసుకుంటున్నట్లు సమాచారం. ఈ సినిమా హిందీ, తెలుగు భాషల్లో ఏకకాలంలో రూపొందుతుండడంతో ఆమెకు అంత పారితోషికం ఇచ్చారట. పూజా తన కెరీర్‌లో ఇప్పటివరకు పైన పేర్కొన్న మొత్తం అత్యధికం. ఈ చిత్రం పై దేశ వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు