దిగ్గజ ఓటీటీ ప్లాట్ ఫామ్ చేతికి ‘మట్టి కుస్తీ’ స్ట్రీమింగ్ రైట్స్ !

దిగ్గజ ఓటీటీ ప్లాట్ ఫామ్ చేతికి ‘మట్టి కుస్తీ’ స్ట్రీమింగ్ రైట్స్ !

Published on Nov 28, 2022 11:02 AM IST

విష్ణు విశాల్ హీరోగా ఐశ్వర్య లక్ష్మి కథానాయికగా నటించిన మూవీ ‘మట్టి కుస్తీ’. కాగా డిసెంబర్ 2న ఈ చిత్రం థియేటర్లలోకి రాబోతోంది. ఈ సినిమాకి విష్ణు విశాల్‌తో కలిసి రవితేజ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నాడు. స్పోర్ట్స్ డ్రామా బ్యాక్‌డ్రాప్‌తో రాబోతున్న ఈ మూవీ పోస్ట్ థియేట్రికల్ స్ట్రీమింగ్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ ఫ్యాన్సీ ధరకు కొనుగోలు చేసింది. తాజాగా ఈ విషయానికి సంబంధించి మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన కూడా వచ్చింది.

ఇక కేరళలో మట్టి కుస్తీ పేరుతో స్పోర్ట్స్ ఉంది. సినిమాలో ఆ కుస్తీకి ప్రాధాన్యం ఉండటంతోనే ఆ పేరు పెట్టారు. పెళ్లి తర్వాత భార్య భర్తల మధ్య ఇగో కారణంగా వచ్చిన సమస్యలు ఏమిటి ?, ఈ క్రమంలో విష్ణు విశాల్ – ఐశ్వర్య లక్ష్మి మధ్య జరిగిన డ్రామా ఏమిటి ?, చివరకు వీరి బంధం ఎలా కొనసాగింది ? అనే కోణంలో ఈ చిత్రం సాగనుంది. ఈ చిత్రానికి జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించారు. అన్నిటికీ మించి హీరో రవితేజ ఈ సినిమాకి నిర్మాతగా పనిచేయడం విశేషం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు