అనూహ్యమైన క్రేజ్ సొంతం చేసుకుంటున్న ‘పెళ్లి చూపులు’

అనూహ్యమైన క్రేజ్ సొంతం చేసుకుంటున్న ‘పెళ్లి చూపులు’

Published on Jul 23, 2016 4:10 PM IST

Pellichoopulu
నూతన దర్శకుడు ‘తరుణ్ భాస్కర్’ దర్శకత్వంలో ‘విజయ్ దేవరకొండ, నీతూ వర్మ’ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘పెళ్లిచూపులు’. పెళ్లి చూపుల్లో కలుసుకున్న అమ్మాయి, అబ్బాయిల మధ్య ఏర్పడ్డ పరిచయం గౌరవంగా మారి, ఆ గౌరవం కాస్త ప్రేమగా మారే కథే ఈ పెళ్లి చూపులు. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం పాటలు, ట్రైలర్లు ఈ మధ్యే విడుదలై మంచి స్పందనను అందుకుంటున్నాయి.

పైగా ప్రముఖ నిర్మాత డి. సురేష్ బాబు సమర్పిస్తుండటం వల్ల సినిమాపై మరింత క్రేజ్ పెరిగింది. ఇటీవలే టెస్ట్ స్క్రీనింగ్ జరుపుకునే ఈ చిత్రంలో గుండెలకు హత్తుకునే భావోద్వేగపూరితమైన సన్నివేశాలు, సున్నితమైన అన్నిభూతులు పుష్కలంగా ఉన్నాయన్నా మంచి పాజిటివ్ టాక్ బయటకు రావడంతో ఈ క్రేజ్ మరింతగా పెరిగింది. రాజ్ కందుకూరి, యష్ రంగినేని సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు