టీజర్ తో సిద్దమవుతున్న ప్రభాస్ టీమ్ !

టీజర్ తో సిద్దమవుతున్న ప్రభాస్ టీమ్ !

Published on Apr 9, 2017 9:39 AM IST


రెబల్ స్టార్ ప్రభాస్ ఈ మధ్యే యంగ్ డైరెక్టర్, ‘రన్ రాజా రన్’ ఫేమ్ సుజీత్ సింగ్ దర్శకత్వంలో ఒక సినిమాని మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ చేస్తున్న కొత్త చిత్రం కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఆ అంచనాలను అందుకునేందుకు సుజిత్ గట్టి గ్రౌండ్ వర్క్ చేసి మరీ ప్రాజెక్టును పట్టాలెక్కిస్తున్నాడు. ముందుగా టీజర్ కోసం చిత్రీకరణ మొదలుపెట్టిన టీమ్ ఇప్పటికే ఆ షూటింగ్ ను దాదాపుగా పూర్తి చేసినట్టు తెలుస్తోంది.

షూటింగ్ పూర్తయ్యాక గ్రాఫికల్ వర్క్, మ్యూజిక్ వర్క్ అన్నీ పూర్తి చేసి టీజర్ ను ఏప్రిల్ 27న సాయంత్రం యూట్యూబ్ లో రిలీజ్ చేస్తారట. ఆ తర్వాత 28 ఉదయం నుండి ‘బాహుబలి – ది కంక్లూజన్’ స్క్రీన్లలో ప్రదర్శిస్తారట. ఈ వార్తతో ప్రభాస్ అభిమానులంతా 27 సాయంత్రం ఎంత త్వరగా వస్తుందా అని ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ విషయంపై యువీ క్రియేషన్స్ నుండి ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. అలాగే ఈ సినిమాకి ‘సాహో’ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు బలమైన సమాచారం వినిపిస్తోంది. తెలుగు, తమిళం, హిందీ భాషలలో రూపొందనున్న ఈ చిత్రానికి బాలీవుడ్ సంగీత దర్శకుల త్రయం శంకర్, ఇహసాన్, లోయ్ లు సంగీతం అందించనుండగా ‘శ్రీమంతుడు, ఘాజి’ ఫేమ్ మది సినిమాటోగ్రఫీ అందించనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు