‘బాహుబలి’ని నెక్స్ట్ సినిమా కోసం వాడుకుంటున్న ప్రభాస్ !

‘బాహుబలి’ని నెక్స్ట్ సినిమా కోసం వాడుకుంటున్న ప్రభాస్ !

Published on Feb 28, 2017 12:21 PM IST


యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఈ మధ్యే తన కొత్త చిత్రాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ‘రన్ రాజా రన్’ ఫేమ్ సుజీత్ డైరెక్ట్ చేయనున్న ఈ చిత్రం యొక్క రెగ్యులర్ షూటింగ్ ముందుగా అనుకున్న ప్రకారం మే నెల నుండి మొదలుకావాల్సి ఉంది. కానీ చిత్ర టీమ్ ఈ ప్లాన్ ని కాస్త మార్చారని తెలుస్తోంది. సుజీత్ ముందుగా మార్చి నెలలో సినిమాలోని కొంత భాగాన్ని షూట్ చేసి, దాని ద్వారా టీజర్ ను డెవలప్ చేస్తారట.

ఆ టీజర్ ను ఏప్రిల్ నెలాఖరున రిలీజ్ కానున్న ‘భాహుబలి-2’ తో పాటు రిలీజ్ చేస్తారని కూడా వినికిడి. ఎందుకంటే ప్రపంచంవ్యాప్తంగా కొన్ని వేల థియేటర్లలో బాహుబలి -2 రిలీజవుతుంది కాబట్టి దానితో పాటే టీజర్ ను రిలీజ్ చేసి థియేటర్లలో ప్రదర్శిస్తే సినిమా జనాల్లోకి ఎక్కువగా వెళ్లే అవకాశం ఉంటుందని ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. దాదాపు రూ.150 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందనున్న ఈ చిత్రానికి ‘మిర్చి, శ్రీమంతుడు, ఘాజి’ ఫేమ్ మది కెమెరా వర్క్ చేస్తుండగా నాలుగు సార్లు జాతీయ అవార్డు గెలుచుకున్న ప్రముఖ ప్రొడక్షన్ డిజైనర్ సాబు సిరిల్, పాపులర్ సంగీత దర్శకుల త్రయం శంకర్, ఇహసాన్, లోయ్ లు సంగీతం అందించనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు