‘పక్కా కమర్షియల్‌’ టికెట్‌ రేట్స్‌పై నిర్మాత బన్నీవాసు క్లారిటీ..!

‘పక్కా కమర్షియల్‌’ టికెట్‌ రేట్స్‌పై నిర్మాత బన్నీవాసు క్లారిటీ..!

Published on Jun 4, 2022 8:00 PM IST

టాలీవుడ్ మ్యాచో స్టార్ గోపీచంద్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం “పక్కా కమర్షియల్”. అల్లు అరవింద్‌ సమర్పణలో జీఏ2 పిక్చర్స్‌, యూవీ క్రియేషన్స్‌తో కలిసి బన్నీవాసు నిర్మించిన ఈ చిత్రం పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుపుకుంటోంది. జూలై 1న విడుదల కానున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్‌, ట్రైలర్లకు మంచి రెస్పాన్స్‌ వచ్చింది.

ఇదిలా ఉంటే ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిర్మాత బన్నీవాసు మాట్లాడుతూ టికెట్ల ధరలపై స్పష్టత ఇచ్చారు. ‘పక్కా కమర్షియల్‌’ టికెట్‌ ధరలు అందరికీ అందుబాటులో ఉంటాయని తెలిపారు. నైజాంలో ఈ సినిమాకి రూ.160 (జీఎస్టీ అదనం), ఆంధ్ర మల్టీప్లెక్స్‌లో రూ.150 (జీఎస్టీ అదనం), సింగిల్‌ స్క్రీన్‌లో రూ.100 (జీఎస్టీ అదనం)గా టికెట్‌ రేట్లు ఉంటాయని అన్నారు. టికెట్‌ కోసం డబ్బులు పెట్టిన వారంతా హ్యాపీగా నవ్వుకుంటూ ఇంటికి వెళ్తారని అన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు