“మహేష్ – రాజమౌళి” మూవీ సెట్స్ మీదకి వెళ్లేది అప్పుడే – ప్రొడ్యూసర్ కే.ఎల్. నారాయణ!

సూపర్ స్టార్ మహేష్ బాబు (SSMB) చివరిసారి గా గుంటూరు కారం చిత్రం లో కనిపించారు. ఈ చిత్రం ప్రేక్షకులని, అభిమానులని బాగా అలరించడం మాత్రమే కాకుండా, బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టడం జరిగింది. తదుపరి జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కనున్న భారీ బడ్జెట్ మూవీ లో కనిపించనున్నారు. ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఎప్పుడెప్పుడు సినిమా స్టార్ట్ అవుతుందా అని అందరూ ఎదురు చూస్తున్నారు.

అయితే ఈ చిత్రం కి సంబందించిన పలు ఆసక్తికర విషయాలను నిర్మాత కే.ఎల్. నారాయణ వెల్లడించారు. ఈ ఏడాది ఆగస్ట్ లేదా సెప్టెంబర్ లో సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది అని తెలిపారు. మహేష్ తన పాత్రకి సంబందించిన మేకోవర్ కోసం రెడీ అవుతున్నారు అని అన్నారు. ఆఫ్రికా బ్యాక్ డ్రాప్ లో సినిమా ఉంటుంది అని, అందరి అంచనాలను సినిమా అందుకుంటుంది అంటూ చెప్పుకొచ్చారు. అంతేకాక 15 ఏళ్ళక్రితం మహేష్ మరియు రాజమౌళి లతో సినిమా చేయాల్సి ఉంది అని, ఇప్పటికి అది కుదిరింది అని అన్నారు.

Exit mobile version