“హరిహర వీరమల్లు” పై నిర్మాత ఇంట్రెస్టింగ్ కామెంట్స్.!

“హరిహర వీరమల్లు” పై నిర్మాత ఇంట్రెస్టింగ్ కామెంట్స్.!

Published on Dec 27, 2022 4:02 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నిధి అగర్వాల్ హీరోయిన్ గా విలక్షణ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా సినిమా “హరిహర వీరమల్లు” కోసం అందరికీ తెలిసిందే. మరి పవన్ సహా చిత్ర యూనిట్ కెరీర్ లో మోస్ట్ అవైటెడ్ గా అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రం అయితే రూపు దిద్దుకుంటుంది.

ఇక ఈ సినిమా షూటింగ్ దగ్గరకి వస్తుండగా ఈ చిత్రం నిర్మాత ఏ ఎం రత్నం తమ బ్యానర్ లో వచ్చిన “ఖుషి” రీ రిలీజ్ సందర్భంగా లేటెస్ట్ మీడియా ఇంటరాక్షన్ లో మాట్లాడుతూ వీరమల్లు సినిమాపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసారు. మరి ఈ చిత్రం అయితే పక్కా పాన్ ఇండియా సినిమా అని దీనిని హిందీ ఆడియెన్స్ కూడా ఖచ్చితంగా బాగా ఆదరిస్తారని నమ్మకంగా చెప్పారు.

అలాగే రీసెంట్ గానే పవన్ ఓ భారీ సీక్వెన్స్ ని కంప్లీట్ చేయగా అది కూడా చాలా బాగా వచ్చింది అని తెలిపారు. దీనితో ఈ కామెంట్స్ సినిమాపై మరిన్ని అంచనాలు పెంచాయి. ఇక ఈ చిత్రానికి అయితే ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా వచ్చే ఏడాది వేసవి కానుకగా రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు