సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా తెరకెక్కుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రానికి తాత్కాలికంగా SSMB 28 అని పేరు పెట్టారు. సినిమా మొదటి షెడ్యూల్ ఇప్పటికే ముగిసింది. ఇప్పటి వరకు వచ్చిన అవుట్ పుట్ పై మహేష్ అసంతృప్తిగా ఉండటంతో సినిమా ఆగిపోయిందని పలు మీడియా పోర్టల్స్ రిపోర్టు చేస్తున్నాయి.
నిర్మాత నాగ వంశీ ఇటువంటి నిరాధారమైన పుకార్లను ఖండించారు. తాజాగా సినిమా పై ఆసక్తికర విషయాలను వెల్లడించారు. మా మోస్ట్ ఎవెయిటింగ్ యాక్షన్ ఎక్స్ట్రావాగాంజా SSMB 28 యొక్క రెండవ షెడ్యూల్ త్వరలో ప్రారంభమవుతుంది. రాబోయే రోజుల్లో మరెన్నో ఉత్తేజకరమైన అప్డేట్లు ఆవిష్కరించబడతాయి. వేచి ఉండండి” అని అన్నారు. ఈ సినిమాలో పూజా హెగ్డే కథానాయిక గా నటిస్తుంది. ఈ చిత్రం లో భారీ తారాగణం తో పాటుగా, ప్రముఖ సాంకేతిక నిపుణులు ఈ చిత్రం కోసం పని చేయనున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీత దర్శకుడు గా వ్యవహరిస్తున్నారు.
The second schedule of our most awaited action extravaganza #SSMB28 will begin soon. Many more exciting updates will be unveiled in upcoming days. Stay tuned!
— Naga Vamsi (@vamsi84) October 31, 2022