ఇంటర్వ్యూ : నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ – ‘సారంగపాణి జాతకం’ చాలా కాలం గుర్తుండిపోతుంది!

ఇంటర్వ్యూ : నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ – ‘సారంగపాణి జాతకం’ చాలా కాలం గుర్తుండిపోతుంది!

Published on Apr 21, 2025 9:00 PM IST

ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీదేవీ మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మాణంలో మోహనకృష్ణ ఇంద్రగంటి తెరకెక్కించిన చిత్రం ‘సారంగపాణి జాతకం’. ప్రియదర్శి, రూపా కొడువయూర్ హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా ఏప్రిల్ 25న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ మీడియాతో ముచ్చటించారు.

– ‘సారంగపాణి జాతకం’లో అన్ని రకాల అంశాలు ఉంటాయి. యాక్షన్, సస్పెన్స్, థ్రిల్లర్, కామెడీ, లవ్ ఇలా అన్ని రకాల అంశాలుంటాయి. ఇంద్రగంటి గారు కథను చెప్పినప్పుడు చాలా ఎగ్జైట్ అయ్యాను. థియేటర్లో అందరూ హాయిగా నవ్వుకునేలా ఈ చిత్రం ఉంటుంది. ఓ ఫుల్ లెంగ్త్ కామెడీ మూవీ చేయాలనే లోటు ఈ చిత్రంతో తీరిపోయింది. జంధ్యాల గారితో ఇలాంటి ఓ పూర్తి వినోదాత్మక సినిమా చేయలేదే? అనే లోటు ఇప్పుడు తీరిపోయింది. కొన్ని చిత్రాలు ఆడియెన్స్‌కి ఎప్పుడూ గుర్తుండిపోతాయి. అలా ఈ ‘సారంగపాణి జాతకం’ చాలా కాలం పాటు గుర్తుండే చిత్రం అవుతుంది.

– ‘జెంటిల్‌మాన్, సమ్మోహనం‘ తరువాత మా కాంబోలో హ్యాట్రిక్ హిట్ రాబోతోంది. మోహనకృష్ణ రాసిన కథ, కథనం ప్రతీ ఒక్కరినీ ఆకట్టుకుంటుంది. ఫ్యామిలీతో పాటుగా యూత్ ఆడియెన్స్ అందరినీ మెప్పిస్తుంది. సినిమా చాలా బాగా వచ్చింది. ఎంతో కష్టపడి ఈ చిత్రాన్ని తీశాం. సరైన థియేటర్లు దొరకాలనే ఉద్దేశంతో కాస్త లేటుగా వస్తున్నాం. మంచి సీజన్ దొరకాలనే ఇప్పటి వరకు ఆగాం. సమ్మర్ హాలీడేస్ స్టార్ట్ అయ్యాయి. ఇదే మంచి సీజన్ అనుకుని మేం ఏప్రిల్ 25న వస్తున్నాం. సమ్మర్‌లో వినోదాన్ని పంచేందుకు మా చిత్రం రాబోతోంది.

– సారంగపాణి జాతకం చిత్రం ఇప్పటికే చాలా మందికి చూపించాం. అందరూ అద్భుతంగా ఉందని అన్నారు. ఫస్ట్ హాఫ్ పూర్తిగా వినోదాత్మకంగా సాగుతుంది. ఇక ద్వితీయార్ధం నెక్ట్స్ లెవెల్లో ఉంటుంది. జాతకం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. చాలా ఇంట్రెస్టింగ్‌గా, సస్పెన్స్‌గా ఉంటుంది. అలా అని మరీ అంత అన్ ప్రిడిక్టబుల్‌గా ఏమీ ఉండదు. అందరినీ హాయిగా ఎంటర్టైన్ చేసేలా మాత్రం ఉంటుంది.

– సమ్మోహనం లాంటి లవ్ స్టోరీ అయినా, జెంటిల్‌మెన్ లాంటి చిత్రమైనా, కామెడీని పండించడం అయినా ఇంద్రగంటి మార్క్ ఎలా ఉంటుందో ఆడియెన్స్ అందరికీ తెలుసు. ఇంద్రగంటి గారి కామెడీ టైమింగ్ ఈ చిత్రంలో నెక్ట్స్ లెవెల్లో ఉంటుంది. ఈ చిత్రం పైసా వసూల్‌గా ఉంటుంది.

– ప్రస్తుతం ఉన్న ట్రెండ్‌కు తగ్గట్టుగా ఈ చిత్రాన్ని మల్చాలని అనుకున్నాం. జంధ్యాల గారి కామెడీ, ఈవీవీ గారి స్టైల్, ఇంద్రగంటి మార్క్ ఇలా అన్నీ ఉండేలా.. అందరినీ మెప్పించేలా, అందరికీ రీచ్ అయ్యేలా సినిమాను ప్లాన్ చేశాం. ఏప్రిల్ 18న సరైన థియేటర్లు దొరకడం లేదనే ఏప్రిల్ 25కి వచ్చాం. ఈ మూవీని ఏప్రిల్ 25న చాలా పెద్ద ఎత్తున రిలీజ్ చేస్తున్నాం. ఓవర్సీస్‌లోనూ 220 థియేటర్లకు పైగానే గ్రాండ్‌గా విడుదల చేస్తున్నాం.

– ప్రస్తుతం కొన్ని కథల మీద చర్చిస్తున్నాం. నాకు సీక్వెల్స్ అంటే చాలా భయం. అందుకే నేను వాటికి దూరంగా ఉంటాను. కానీ బాలకృష్ణ గారు మాత్రం ‘ఆదిత్య 369‘ సీక్వెల్ పనులు స్టార్ట్ చేస్తే దానిలో భాగం అవుతాను. ‘యశోద‘ డైరెక్టర్లు చెప్పిన రెండు కథలు నాకు చాలా నచ్చాయి. పవన్ సాధినేని చెప్పిన ఓ కథ కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. మళ్లీ మోహనకృష్ణ ఇంద్రగంటి గారితో ఇంకో సినిమా చేయబోతున్నాను. అన్నీ ఫైనల్ అయ్యాక అన్ని ప్రాజెక్టుల గురించి అధికారికంగా ప్రకటిస్తాను.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు