‘హనీ ట్రాప్’ సినిమా యువతను చైతన్యవంతులను చేస్తుంది – నిర్మాత వివి వామన రావు

‘హనీ ట్రాప్’ సినిమా యువతను చైతన్యవంతులను చేస్తుంది – నిర్మాత వివి వామన రావు

Published on Sep 11, 2021 10:15 AM IST


రిషి, శిల్ప నాయక్, తేజు అనుపోజు, శివ కార్తీక్ ప్రధాన పాత్రల్లో సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘హనీ ట్రాప్’. భరద్వాజ్ సినీ క్రియేషన్స్ పతాకంపై వివి వామన రావు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 17న రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదల అవుతుంది. అయితే వివి వామనరావు ఈ చిత్రానికి నిర్మాతగానే కాకుండా కథా స్క్రీన్ ప్లే అందించి ఓ కీలక పాత్రలో నటించడం విశేషం.

ఈ సందర్భంగా నటుడు, రచయిత, నిర్మాత వి వి వామన రావు మాట్లాడుతూ హనీ ట్రాప్‌లో పడి చాలా మంది పొలిటిషన్స్, డాక్టర్స్, వ్యాపారవేత్తలు, ఎందరో వీఐపీలు సర్వం కోల్పోతున్నారు. ఇలాంటి వాటిని మనం ప్రతిరోజూ పత్రికల్లో చదువుతూనే ఉన్నాం. మరి ఇలాంటి హనీ ట్రాప్‌లో పడకుండా నేటి యువతను చైతన్యవంతుల్ని చేయాలని ఈ సినిమాను నిర్మించినట్టు వివి వామన రావు తెలిపారు.

ఇకపోతే 1979 నుంచి రచయితగా నేను చాలా నాటకాలు రాసానని, నా కథకి నంది అవార్డు కూడా వచ్చిందని అన్నారు. కొన్ని సీరియల్స్ రాసి నిర్మించానని, చాలా కథలు కూడా రాసానని అన్నారు. 8 ఏళ్ళ క్రితం ఒక పాకిస్తాన్ అమ్మాయి భారతదేశం నేవీ ఆఫీసర్‌ని ట్రాప్ చేసి మన దేశం రహస్య సమాచారాన్ని దోచుకుంది. అప్పుడే ఈ కథ పుట్టిందని, తర్వాత ఈ మధ్య కాలంలో ఈ హనీ ట్రాప్ లాంటి చాలా వార్తలు పత్రికల్లో చదివానని, ఇది మంచి సమయం అని ఈ కథని సినిమాగా చిత్రీకరించామని వివి వామన రావు అన్నాడు.

గతంలో సునీల్ కుమార్ రెడ్డి గారు రొమాంటిక్ క్రిమినల్స్ లాంటి సినిమాలు నిర్మించి కమర్షియల్ సక్సెస్ సాధించారని, అయితే నా కథకి సునీల్ కుమార్ రెడ్డి గారు బాగా సరిపోతారని, తనతో ప్రయాణం మొదలు పెట్టానని అన్నారు. నేను ఊహించుకున్న కథ కన్నా సునీల్ కుమార్ రెడ్డి గారు అద్భుతంగా దర్శకత్వం వహించారని, సినిమా చాలా బాగా వచ్చిందని, నా తర్వాత సినిమా కూడా సునీల్ గారితోనే అని వివి వామన రావు చెప్పుకొచ్చారు.

నేను చాలా నాటకాల్లో సీరియల్స్‌లో నటించానని, ఈ చిత్రంలో కూడా నటించే అవకాశం తనకు వచ్చిందని, ఒక పొలిటికల్ మినిస్టర్‌కి పీఏ గా నటించానని, ఆ క్యారెక్టర్ చాలా బాగా వచ్చిందని అన్నారు. యూత్ కి మా సినిమా బాగా నచ్చుతుందని అన్నారు.

మా సినిమా సెన్సార్‌కి వెళ్ళినప్పుడు చాలా సన్నివేశాలను కట్ చేస్తారని నేను అనుకున్నానని, కానీ సెన్సార్ వాళ్ళు ఎటువంటి కటింగ్ లేకుండా మాకు ఎ సర్టిఫికెట్ ఇచ్చారని, సీన్‌లు కట్ చేస్తే సినిమా పట్టు పోతుందని, అందుకే సెన్సార్ ఎలాంటి కట్స్ చెప్పలేదని అన్నారు.

ఈ కరోనా లాక్‌డౌన్‌లో నిర్మాతకి ఇబ్బందిగానే ఉందని, తెలంగాణలో అన్ని అనుకూలంగానే ఉన్నాయి కానీ ఆంధ్రాలో 3 షోలకు మాత్రమే అనుమతి ఉందని, మా చిత్రాన్ని ఈ నెల 17న విడుదల చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. సినిమా మంచి విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నామని అన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు