500 కోట్ల క్లబ్ లోకి మణిరత్నం “పొన్నియిన్ సెల్వన్”

500 కోట్ల క్లబ్ లోకి మణిరత్నం “పొన్నియిన్ సెల్వన్”

Published on Nov 18, 2022 6:00 PM IST


డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ పీరియాడికల్ డ్రామా పొన్నియిన్ సెల్వన్. మద్రాస్ టాకీస్ మరియు లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ లపై మణిరత్నం, సుభస్కరన్ లు సంయుక్తంగా నిర్మించారు. ఆస్కార్ అవార్డు విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన ఈ చిత్రం థియేటర్ల లో విడుదల అయ్యి తమిళ నాట సెన్సేషన్ క్రియేట్ చేయడం జరిగింది. ఈ చిత్రం ఇప్పుడు మరొక మైలు రాయిని చేరుకుంది.

ఈ చిత్రం తాజాగా 500 కోట్ల రూపాయల క్లబ్ లో చేరింది. పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కిన ఈ చిత్రం లో విక్రమ్, ఐశ్వర్య రాయ్, జయం రవి, కార్తీ, త్రిష, ఐశ్వర్య లక్ష్మి, శోభిత ధూళిపాళ, ప్రభు, శరత్ కుమార్, విక్రమ్ ప్రభు, ప్రకాష్ రాజ్, రహ్మాన్, ఆర్. పార్తిబన్ లు ప్రధాన పాత్రల్లో నటించారు.ఈ చిత్రం కి సంబంధించిన రెండవ పార్ట్ వచ్చే ఏడాది విడుదల కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు