మన టాలీవుడ్ లెజెండరు హీరో మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం పలు సినిమాల్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఏకకాలంలోనే మెగాస్టార్ ఇప్పుడు మూడు సినిమాలు చేసేస్తూ బిజీ బిజీగా ఉన్నారు. అయితే ఈ చిత్రాల్లో మళయాళ బ్లాక్ బస్టర్ సినిమా “లూసిఫర్” కి రీమేక్ గా దర్శకుడు మోహన్ రాజా తో చేస్తున్న భారీ సినిమా “గాడ్ ఫాథర్” కూడా ఒకటి.
భారీ తారాగణంతో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పుడు మేకర్స్ ఒక అదిరే క్లారిటీ ని ఇచ్చారు. ఈ సినిమాలో ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ ఒక కీలక పాత్ర పోషిస్తున్నట్టుగా గత రెండు రోజులు ఫిల్మ్ సర్కిల్స్ లో టాక్ రాగా ఇప్పుడు దీనిని అధికారికంగా మెగాస్టార్ అనౌన్స్ చేశారు. అంతే కాకుండా ఫస్ట్ టైం పూరి జగన్నాథ్ ని నటునిగా పరిచయం చెయ్యడం ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ని కూడా రివీల్ చేసారు.
“నర్సీపట్నం నుంచి ఓ కుర్రాడు,వెండితెర పైన నటుడిగా వెలుగు వెలగాలని,హైదరాబాద్ వచ్చాడు.ఒకటి అరా వేషాలు వేసాడు ఇంతలో కాలం చక్రం తిప్పింది.స్టార్ డైరెక్టర్ అయ్యాడు.కానీ అతని మొదటి కల అలా మిగిలిపోకూడదు కదా..అందుకే మా గాడ్ ఫాథర్ సెట్స్ నుంచి నటుడుగా పూరి జగన్నాథ్ ని పరిచయం చేస్తున్నాను” అని అసలు విషయం తెలిపారు.
నర్సీపట్నం నుంచి ఓ కుర్రాడు,వెండితెర పైన నటుడిగా వెలుగు వెలగాలని,హైదరాబాద్ వచ్చాడు.ఒకటి అరా వేషాలు వేసాడు ఇంతలో కాలం చక్రం తిప్పింది.స్టార్ డైరెక్టర్ అయ్యాడు.కానీ అతని మొదటి కల అలా మిగిలిపోకూడదు కదా..అందుకే
introducing my @purijagan in a special role,from the sets of #Godfather pic.twitter.com/8NuNuoY33j— Chiranjeevi Konidela (@KChiruTweets) April 9, 2022