దర్శకుడు పూరి నుంచి ఎమోషనల్ అండ్ తన మార్క్ లెటర్.!

దర్శకుడు పూరి నుంచి ఎమోషనల్ అండ్ తన మార్క్ లెటర్.!

Published on Oct 30, 2022 12:03 PM IST

ఈ ఏడాది టాలీవుడ్ దగ్గర రిలీజ్ అయ్యిన పలు భారీ అంచనాలు చిత్రాల్లో మాస్ అండ్ డాషింగ్ దర్శకుడు పూరి జగన్నాథ్ నుంచి వచ్చిన అవైటెడ్ పాన్ ఇండియా సినిమా “లైగర్” కూడా ఒకటి. పూరి జగన్నాథ్ కెరీర్ లోనే మళ్ళీ బిజినెస్ మెన్ తర్వాత మోస్ట్ హైప్డ్ చిత్రంగా ఇది వచ్చింది. అయితే అది అనూహ్యంగా అనుకున్న రేంజ్ సక్సెస్ కాలేదు. అయినా కూడా పూరి అయితే డీలా పడలేదు.

ఆ అపజయాన్ని నార్మల్ గానే తీసుకున్నాడు. కానీ మెల్లగా పరిస్థితులు మారుతుండే సరికి పూరి ఓ ఎమోషనల్ లెటర్ ని తన మార్క్ రచనతో రిలీజ్ చేయడం ఆసక్తిగా మారింది. విజయాపజయాలు రెండు వేరే కాదు అవి ఒకటే లైఫ్ లో జరిగే ప్రతి దాన్ని ఓ సంఘటన తాలూకా ఏ పీరియన్స్ గా మాత్రమే చూడాలి తప్ప ఫెయిల్యూర్ సక్సెస్ గా చూడకూడదు అని తెలిపారు.

అలాగే అయితే ఓటమి వస్తే కేవలం జ్ఞ్యానం వస్తుంది సినిమాలో హీరోలకి జరిగినట్టే అందరికీ జరుగుతాయని అంతా పొగుడుతారు తిడతారు నిజాన్ని ఎవరూ కాపాడాల్సిన పని లేదు నిజాన్ని నిజమే కాపాడుకుంటుంది అని అలాగే తాను ఒక్క ఆడియెన్స్ ని తప్ప ఎవరినీ మోసం చెయ్యలేదు ఒక్క ఆడియెన్స్ ని తప్ప.

వాళ్ళని మళ్ళీ మంచి తప్పకుండా తీసి ఎంటర్టైన్ చేస్తానని చివరి మాటలుగా ఇందులో చెప్పారు. వీటితో పాటుగా ఇక డబ్బు అంటారా చచ్చాక ఇక్కడ నుంచి ఒక్క రూపాయి తీసుకెళ్లినవాడిని ఒక్కడిని చూపించండి నేను కూడా దాచుకుంటా అంటూ పూరి అయితే ముగించారు. దీనితో తన మార్క్ లెటర్ ఇప్పుడు వైరల్ గా మారింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు