‘పుష్ప-2’ బాక్సాఫీస్ ఊచకోత.. 4 రోజుల్లో 829 కోట్లు!

‘పుష్ప-2’ బాక్సాఫీస్ ఊచకోత.. 4 రోజుల్లో 829 కోట్లు!

Published on Dec 9, 2024 4:01 PM IST

ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ‘పుష్ప-2’ రికార్డుల వేట కొనసాగుతూ ఉంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది. ఇక ఈ సినిమాను థియేటర్లలో ఎంజాయ్ చేసేందుకు ప్రేక్షకులు క్యూ కడుతున్నారు. సినిమా రిలీజ్ అయిన నాలుగు రోజుల్లో ఈ ‘పుష్ప-2’ మూవీ ఇండియన్ సినిమా రికార్డులను తిరగరాస్తూ దూసుకెళ్తోంది.

తాజాగా ఈ సినిమా నాలుగు రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్ల వివరాలు మేకర్స్ వెల్లడించారు. ఈ సినిమా నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.829 కోట్ల గ్రాస్ వసూళ్లతో సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. నాలుగు రోజుల్లోనే రూ.800 కోట్ల మార్క్‌ను అందుకున్న ఫాస్టెస్ట్ చిత్రంగా ‘పుష్ప-2’ చరిత్ర సృష్టించింది.

ఇక ఈ సినిమా జోరు మరో వారం పాటు ఇలాగే కొనసాగడం ఖాయమని సినీ సర్కిల్స్ చెబుతున్నాయి. దీంతో ఈ సినిమా కలెక్షన్స్ ఎక్కడి వరకు వెళ్తాయా అనే ఆసక్తి అందరిలో నెలకొంది. అల్లు అర్జున్ నటవిశ్వరూపంతో ఈ సినిమా నెక్స్ట్ లెవెల్‌లో పెర్ఫార్మ్ చేస్తుందని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో అందాల భామ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించగా దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందించాడు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేశారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు