ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో ఉన్నారు. అతను మరియు అతని భార్య ఒక వివాహానికి హాజరయ్యేందుకు వెళ్ళడం జరిగింది. నటుడి కొత్త చిత్రం పుష్ప ది రూల్ హైదరాబాద్ లో షూటింగ్ షురూ అయింది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఈరోజు హైదరాబాద్లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేకంగా వేసిన సెట్లో ప్రారంభమైంది.
అల్లు అర్జున్ హైదరాబాద్ తిరిగి వచ్చాక సెట్స్లో జాయిన్ అవుతాడు. మైత్రీ మూవీ మేకర్స్ భారీ ఎత్తున నిర్మిస్తున్న ఈ బిగ్గీలో రష్మిక మందన్న కథానాయిక గా నటిస్తుంది. ఫహద్ ఫాసిల్, సునీల్, అనసూయ భరద్వాజ్, ధనంజయ తదితరులు కూడా ఈ ప్రాజెక్ట్లో భాగమయ్యారు. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు గా వ్యవహరిస్తున్నారు.