ఓటీటీలోకి “పుష్ప”.. ఆ డేట్ ఫిక్స్ అయ్యిందా?

ఓటీటీలోకి “పుష్ప”.. ఆ డేట్ ఫిక్స్ అయ్యిందా?

Published on Jan 4, 2022 1:14 AM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, రష్మిక మందన్నా హీరోయిన్‌గా సుకుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియన్ లెవల్లో తెరకెక్కించిన చిత్రం “పుష్ప ది రైజ్”. డిసెంబర్ 17న విడుదలైన ఈ చిత్రం అన్ని చోట్ల బ్లాక్ బస్టర్ హిట్‌ని సొంతం చేసుకుని రికార్డ్ స్థాయిలో వసూళ్లను రాబడుతుంది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే రూ.300కోట్ల ట్రేడ్‌ మార్క్‌ను కూడా దాటేసింది.

అయితే ఈ చిత్రానికి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్‌ వార్త ఇప్పుడు సోషల్‌ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. ఈ సినిమా తొందరలోనే ఓటీటీలోకి రాబోతుందట. జనవరి 7న “ఆర్‌ఆర్‌ఆర్‌” విడుదల కావాల్సి ఉండగా, ఆ సినిమా వాయిదా పడిన సంగతి తెలిసిందే. దీంతో ఆర్‌ఆర్‌ఆర్‌ డేట్‌ను క్యాష్‌ చేసుకోవాలని భావిస్తూ జనవరి 7న “పుష్ప” సినిమాను అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌ చేయాలని యూనిట్ భావిస్తుందట. అయితే త్వరలోనే దీనికి సంబంధించి అఫీషియల్‌ అనౌన్స్‌మెంట్ రానుందట.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు