బుల్లితెరపై కూడా తగ్గేదేలే అంటున్న పుష్ప రాజ్

బుల్లితెరపై కూడా తగ్గేదేలే అంటున్న పుష్ప రాజ్

Published on Mar 19, 2023 2:08 AM IST


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియన్ సూపర్ హిట్ మూవీ పుష్ప ది రైజ్. రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన ఈ మూవీ 2021 డిసెంబర్ లో రిలీజ్ అయి అన్ని భాషల్లో గొప్ప విజయం సొంతం చేసుకుంది. అనంతరం అటు ఓటిటి తో పాటు ఇటు బుల్లితెర పై కూడా మంచి టిఆర్పి రేటింగ్స్ అందుకున్న పుష్ప ది రైజ్ మూవీ తాజాగా టెలివిజన్ లో మరొక్కసారి ప్రదర్శితం అయి 5.53 టిఆర్పి రేటింగ్ దక్కించుకోవడం విశేషం.

ఈ మూవీలోని సాంగ్స్, అల్లు అర్జున్ యాక్టింగ్, స్టైల్, ఫైట్స్, మాస్ యాక్షన్ సీన్స్, విజువల్స్ అన్ని కూడా అదిరిపోయాయి. దానితో అన్ని వర్గాల ఆడియన్స్ యొక్క మెప్పు సొంతం చేసుకున్న ఈ మూవీ టివి లో ప్రదర్శితం అయిన ప్రతిసారి మంచి టిఆర్పి అందుకుంటోంది. కాగా ప్రస్తుతం ఈ మూవీకి సీక్వెల్ గా తెరకెక్కుతోన్న పుష్ప ది రూల్ పై అల్లు అర్జున్ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ లో కూడా భారీ స్థాయి అంచనాలు ఉన్నాయి. కాగా ఈ మూవీకి సంబందించిన అప్ డేట్స్ ఒక్కొక్కటిగా త్వరలో రానున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు