అఫీషియల్: తమ విలీనాన్ని ప్రకటించిన PVR మరియు INOX

అఫీషియల్: తమ విలీనాన్ని ప్రకటించిన PVR మరియు INOX

Published on Mar 27, 2022 8:10 PM IST


భారతదేశంలో అతిపెద్ద మల్టీప్లెక్స్ చైన్‌లు అయిన PVR మరియు INOX ఈ రోజు తమ విలీనాన్ని అధికారికంగా ప్రకటించాయి. బోర్డు సమావేశం తర్వాత, వారు దీనిని బహిరంగంగా ప్రకటించారు మరియు మల్టీప్లెక్స్ దిగ్గజాలు సంయుక్తంగా భారతదేశం అంతటా 1500 కంటే ఎక్కువ స్క్రీన్‌లను కలిగి ఉన్నాయి.

ఇక నుండి, సంయుక్త సంస్థ PVR INOX లిమిటెడ్ గా పిలువబడుతుంది. PVR చైర్మన్ అజయ్ బిజిలీ కొత్త బ్రాండ్‌కు కొత్త మేనేజింగ్ డైరెక్టర్‌గా కూడా నియమితులయ్యారు. చెప్పాలంటే, ఇటీవలి సంవత్సరాలలో వినోద పరిశ్రమలో ఇది అతిపెద్ద సమ్మేళనాల్లో ఒకటి అని చెప్పాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు