మంచి బజ్ అందుకుంటున్న రాజ్ తరుణ్ “అహనా పెళ్ళంట”.!

మంచి బజ్ అందుకుంటున్న రాజ్ తరుణ్ “అహనా పెళ్ళంట”.!

Published on Nov 13, 2022 4:01 PM IST


ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్నటువంటి యంగ్ హీరోస్ లో చాలా మంది ఓటీటీ పలు లో సిరీస్, మూవీస్ తో ఆడియన్స్ ను ఆకట్టుకుంటున్నారు.మరి అలా లేటెస్ట్ గా రాజ్ తరుణ్ ఓటిటి ఎంట్రీ చేసిన వెబ్ షో ‘అహనా పెళ్ళంట’. ఇక డీటెయిల్స్ చూస్తే శివాని జంటగా సంజీవ్ రెడ్డి డైరెక్షన్ లో వస్తున్న ఈ వెబ్ సిరీస్ ను సూర్య రాహుల్ తమడ , సాయి దీప్ బొర్రా నిర్మించారు. ట్రైలర్ , సాంగ్స్ ఈ సిరీస్ పై మంచి బజ్ క్రియేట్ చేస్తున్నాయి.

ఎనిమిది ఎపిసోడ్స్ తో ఆసక్తిగా తెరకెక్కిన ఈ సిరీస్ లో ప్రేక్షకులకు కావల్సినంత వినోదం ఉండనుందని టీజర్ , ట్రెయిలర్ చూస్తే తెలుస్తుంది. ఓవరాల్ గా రాజ్ తరుణ్ తన కి పర్ఫెక్ట్ అనిపించే సిరీస్ తో ఓటీటీ ఎంట్రీ ఇస్తున్నాడనిపిస్తుంది. రిలీజ్ కి ముందు కంటెంట్ తో ఎట్రాక్ట్ చేస్తున్న ఈ సిరీస్ ఈ నెల 17న జీ5 లో స్ట్రీమ్ అవ్వబోతుంది. పోసాని కృష్ణమురళి , హర్షవర్ధన్ , ఆమని తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు