‘ఎం.ఎస్.ధోనీ’ తెలుగు ఆడియో లాంచ్‌కు ధోనీ, రాజమౌళి!

‘ఎం.ఎస్.ధోనీ’ తెలుగు ఆడియో లాంచ్‌కు ధోనీ, రాజమౌళి!

Published on Sep 21, 2016 8:38 PM IST

raj-mouli-dhoni
ఎం.ఎస్.ధోని.. భారతదేశంలో క్రికెట్ తెలిసిన ప్రతివ్యక్తికీ పరిచయం ఉన్న పేరు. భారత క్రికెట్‌కు తిరుగులేని విజయాలను అందించిన ధోని జీవిత కథతో బాలీవుడ్‌లో ప్రముఖ దర్శకుడు నీరజ్ పాండే, ‘ఎం.ఎస్.ధోని – ది అన్‌టోల్డ్ స్టోరీ’ అనే సినిమాను తెరకెక్కించారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ధోనీ పాత్రలో నటించారు. ఇక ధోనికి దేశవ్యాప్తంగా ఉన్న క్రేజ్ దృష్ట్యా, ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లోనూ డబ్ చేస్తున్నారు. ఇందులో తెలుగు వర్షన్‌కు సంబంధించి ఇప్పటికే విడుదలైన ట్రైలర్ మంచి ఆసక్తి రేకెత్తించింది.

ఇక తాజాగా ఈనెల 24న హైద్రాబాద్‌లో తెలుగు వర్షన్ ఆడియో లాంచ్‌ను పెద్ద ఎత్తున నిర్వహించాలని టీమ్ ప్లాన్ చేసిందట. ఈ ఆడియో లాంచ్‌కు ఎం.ఎస్.ధోనీ ముఖ్య అతిథిగా హాజరు కానుండడం అతిపెద్ద విశేషంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ధోనీతో పాటు దర్శక ధీరుడు రాజమౌళి కూడా ఈ వేడుకకు హాజరు కానున్నారు. ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి తిరుగులేని శక్తిగా ధోని ఎలా ఎదిగాడు అన్నది ఈ సినిమా కథాంశం. ఫాక్స్ స్టార్ స్టూడియోస్ నిర్మించిన ఈ సినిమాలో భూమిక ఓ ప్రధాన పాత్రలో నటించారు. సెప్టెంబర్ 30న అన్ని భాషల్లో ఒకేసారి భారీ ఎత్తున సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు