రాజమౌళి – మహేష్ బాబు సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ? అంటూ మహేష్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. మరోపక్క ఈ సినిమా గురించి ఏదొక రూమర్ వినిపిస్తూనే ఉంది. తాజాగా మరో కొత్త రూమర్ వైరల్ అవుతుంది. మార్చిలో ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభించడానికి ముహూర్తం కుదిరిందని టాక్ నడుస్తోంది. ఐతే, ప్రస్తుతం మహేశ్.. త్రివిక్రమ్ సినిమాతో బిజీగా ఉన్నారు. మరి మార్చి నుంచి మహేష్ రాజమౌళి సినిమాకి డేట్లు ఇస్తాడా ? చూడాలి.
ఇక ఈ సినిమాకి సంబంధించి ఇంకా నటీనటుల ఎంపిక జరగలేదు. కాకపోతే.. ఈ సినిమా రచయిత విజయేంద్రప్రసాద్ రాసిన కథలో కథానాయకగా దీపికా పడుకోణె అయితే బాగుంటుందని మేకర్స్ ఫీల్ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇక విజయేంద్రప్రసాద్, మహేశ్ కోసం ఒక పవర్ ఫుల్ స్క్రిప్టు రాశారట. ఆఫ్రికా బ్యాక్ డ్రాప్ లో అడ్వెంచర్ థ్రిల్లర్ గా ఈ కథా నేపథ్యం సాగుతుందని తెలుస్తోంది. నిజంగానే మహేష్ – రాజమౌళి కలయికలో ఒక అడ్వెంచర్ థ్రిల్లర్ వస్తే కచ్చితంగా అది అన్ని వర్గాల ప్రేక్షకులను థ్రిల్ చేస్తోంది.