మిస్ ఇండియా పోటీలో పాల్గొనబోతున్న హీరో రాజశేఖర్ పెద్ద కుమార్తె..!

మిస్ ఇండియా పోటీలో పాల్గొనబోతున్న హీరో రాజశేఖర్ పెద్ద కుమార్తె..!

Published on Apr 19, 2022 3:00 AM IST

సీనియర్‌ నటులు డా.రాజశేఖర్‌, జీవిత దంపతుల పెద్ద కుమార్తె, నటి శివాని ‘ఫెమినా మిస్‌ ఇండియా 2022’ పోటీలో పాల్గొనబోతున్నట్టు తెలుస్తుంది. సోమవారం ఆడిషన్స్‌కు హాజరయ్యాయని, తన వంతుగా ఉత్తమ ప్రదర్శన కూడా ఇచ్చానని సోషల్‌ మీడియా వేదికగా శివాని తెలియజేసింది.

అయితే తాను కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నానని నాకు ఈ అవకాశం ఇచ్చిన ఫెమినా సంస్థకు ధన్యవాదాలు తెలిపింది రాజశేఖర్ కుమార్తె. ఫెమినా మిస్‌ ఇండియా పోటీలో పాల్గొంటున్న ఇతర రాష్ట్ర మహిళలకు కూడా శివానీ ఆల్‌ ది బెస్ట్‌’ అని తెలిపింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు