రాజేంద్ర ప్రసాద్‌ కు కరోనా పాజిటివ్!

రాజేంద్ర ప్రసాద్‌ కు కరోనా పాజిటివ్!

Published on Jan 9, 2022 4:35 PM IST

సీనియర్ హీరో రాజేంద్ర ప్రసాద్‌ కి కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ విషయాన్ని రాజేంద్ర ప్రసాద్‌ కుటుంబ సభ్యులు స్వయంగా చెప్పారు. రాజేంద్ర ప్రసాద్‌ ఆరోగ్యం ప్రస్తుతం నిలడగా ఉందని.. అభిమానులు, సన్నిహితులు ఆందోళన చెందాల్సిన పని లేదని వాళ్ళు తెలిపారు. ప్రస్తుతం రాజేంద్రప్రసాద్ హైదరాబాద్‌ లోని ఎఐపీ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.

రాజేంద్ర ప్రసాద్‌ కి నిన్నటి నుంచి తీవ్ర అనారోగ్యంగా ఉంది. దాంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేర్పించారు. దాంతో ఆయనను వైద్యులు పరీక్షించగా ఆయనకు కరోనా అని తేలింది. ప్రస్తుతం ఆస్పత్రిలోనే రాజేంద్ర ప్రసాద్‌ ఉన్నారు. కరోనా మూడో వేవ్ లో చాలా వేగంగా వ్యాప్తి చెందుతుంది. టాలీవుడ్ లో వరుసగా కేసులు నమోదు అవుతున్నాయి. అందరూ కరోనా నియమ నిబంధనలు పాటిస్తూ జాగ్రత్తగా ఉండాల్సిన సమయం వచ్చింది.

ఏది ఏమైనా వరుసగా మళ్ళీ కేసులు వస్తుండడంతో.. మూవీ మేకర్స్ లో కూడా ఆందోళన మొదలైంది. షూటింగ్స్ కి బ్రేక్ ఇవ్వాల్సి వస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు