టాక్..”జైలర్” తర్వాత సూర్య డైరెక్టర్ తో తలైవర్.?

టాక్..”జైలర్” తర్వాత సూర్య డైరెక్టర్ తో తలైవర్.?

Published on Oct 24, 2022 7:43 PM IST

తమిళ నాట బిగ్గెస్ట్ సూపర్ స్టార్ తలైవర్ రజినీకాంత్ హీరోగా దర్శకుడు నెల్సన్ దిలీవ్ కుమార్ తో “జైలర్” అనే ఓ భారీ యాక్షన్ థ్రిల్లర్ సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. దీనితో అయినా రజిని అయితే తన స్టార్డం రేంజ్ కం బ్యాక్ ని అందుకోవాలి అని అటు తమిళ్ తో పాటుగా తెలుగు ఫ్యాన్స్ కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి ఇప్పుడు జైలర్ తర్వాత అయితే రజిని లైనప్ పై ఇంట్రెస్టింగ్ బజ్ ఇప్పుడు బయటకి వచ్చింది.

మరి దీని ప్రకారం అయితే కోలీవుడ్ దర్శకుడు అయినటువంటి జ్ఞ్యానవేల్ ముత్తు తో రజిని నెక్స్ట్ ప్రాజెక్ట్ చేయనున్నారట. మరి ఈ దర్శకుడు అయితే సూర్య తో హార్డ్ హిట్టింగ్ డ్రామా “జై భీం” చేసి నేషనల్ సహా ఇంటర్నేషనల్ సినిమా దగ్గర కూడా మంచి పేరు సంపాదించుకున్నాడు. మరి ఈ కాంబినేషన్ లో అయితే సినిమా ఎలా ఉంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు