రజినికాంత్ ‘జైలర్’ తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ దక్కించుకున్న ప్రముఖ సంస్థ ?

రజినికాంత్ ‘జైలర్’ తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ దక్కించుకున్న ప్రముఖ సంస్థ ?

Published on Jun 1, 2023 10:03 PM IST

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ప్రస్తుతం తెరకెక్కుతోన్న యాక్షన్ మూవీ జైలర్. తమన్నా భాటియా హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో మోహాన్ లాల్, నాగబాబు, శివరాజ్ కుమార్, జాకీ ష్రాఫ్, రమ్యకృష్ణ, సునీల్ తదితరులు కీలక పాత్రలు చేస్తున్నారు. అనిరుద్ సంగీతం అందిస్తున్న ఈ మూవీని సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ ఎంతో భారీ వ్యయంతో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న జైలర్ ఆగష్టు 10న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి రానుంది.

విషయం ఏమిటంటే, తాజగా జైలర్ కి సంబంధి తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ని ప్రముఖ సంస్థ ఏషియన్ సినిమాస్ వారు భారీ ధరకు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. నెల్సన్ దిలీప్ కుమార్ ఎంతో గ్రాండ్ లెవెల్లో తెరకెక్కిస్తున్న ఈ మూవీ తప్పకుండా మూవీ అన్ని వర్గాల ఆడియన్స్ ని అలానే రజిని ఫ్యాన్స్ ని ఆకట్టుకుంటుందని జైలర్ యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు