అసహనం వ్యక్తం చేస్తున్న రామ్ చరణ్ ఫ్యాన్స్ … కారణం అదే ?

అసహనం వ్యక్తం చేస్తున్న రామ్ చరణ్ ఫ్యాన్స్ … కారణం అదే ?

Published on Dec 23, 2022 3:00 AM IST

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా దిగ్గజ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్న లేటెస్ట్ మూవీ RC 15. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ పై మెగా ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ లో కూడా బాగా అంచనాలు ఉన్నాయి. థమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ ప్రస్తుతం వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. అయితే విషయం ఏమిటంటే, తాజాగా ఈ మూవీ యొక్క లేటెస్ట్ షెడ్యూల్ ని రాజమండ్రిలో భారీ స్థాయిలో నిర్వహిస్తోంది యూనిట్.

కాగా మూవీ కోసం రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో వేసిన పలు సెట్టింగ్స్ తాలూకు పిక్స్ నేడు సాయంత్రం నుండి సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉన్నాయి. అయితే ఈ విధంగా షూటింగ్ పిక్స్ ని పలువురు వైరల్ చేస్తుండడంతో ఒకింత అసహనం వ్యక్తం చేస్తున్న రామ్ చరణ్ ఫ్యాన్స్, ఇకపైన అయినా ఈ విధంగా మూవీ తాలూకు లీక్డ్ పిక్స్ బయటకు రాకుండా RC 15 యూనిట్ పక్కాగా జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు. హై టెక్నీకల్ వాల్యూస్ తో రూపొందుతోన్న ఈ మూవీలో శ్రీకాంత్, అంజలి, సునీల్, ఎస్ జె సూర్య తదితరులు కీలక పాత్రలు చేస్తున్నారు. కాగా ఈ ప్రతిష్టాత్మక మూవీ వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదలయ్యే అవకాశం కనపడుతోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు