ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా మావెరిక్ దర్శకుడు శంకర్ తో ఓ భారీ చిత్రం చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. మరి శంకర్ అలాగే చరణ్ కెరీర్ లో కూడా 15వ సినిమాగా ప్లాన్ చెయ్యగా దీనిపై భారీ హైప్ కూడా ఉంది. ఇక ఈ సినిమా షూటింగ్ లో అయితే రామ్ చరణ్ సమయానుగుణంగా పాల్గొంటుండగా రీసెంట్ గా అయితే వచ్చిన గ్యాప్ లో అయితే రామ్ చరణ్ తన భార్య ఉపాసన తో కలిసి RRR జపాన్ ప్రమోషన్స్ కి వెళ్లి తర్వాత ఓ చిన్న వెకేషన్ కి కూడా వెళ్లారు.
ఇక ఫైనల్ గా అయితే ఈ వెకేషన్ ని చరణ్ దంపతులు పూర్తి చేసుకొని ఈరోజు ఉదయం హైదరాబాద్ లో ల్యాండ్ అయ్యారు. దీనితో ఇప్పుడు ఈ విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరి దీనితో అయితే నెక్స్ట్ మళ్ళీ శంకర్ సినిమాలో చరణ్ పాల్గొననున్నాడు. ఇక ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటించగా దిల్ రాజు నిర్మాణం వహిస్తున్నారు.
Mega Powerstar #RamCharan Garu and @upasanakonidela Garu Back From Vacation , Today Hyderabad Airport @AlwaysRamCharan#ManOfMassesRamCharan #RC15 pic.twitter.com/xKQbe5SpwV
— Chiranjeevi Army (@chiranjeeviarmy) November 3, 2022